యూఏఈ:పెండింగ్ జీతాల చెల్లింపులో 762 మంది కార్మికులకు ఊరట
- February 25, 2020
యూఏఈ:బకాయి జీతాల కోసం నెలల తరబడి న్యాయపోరాటం చేస్తున్న 762 మంది కార్మికులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పెండింగ్ శాలరీల చెల్లింపు కోసం dh20 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా మొబైల్ కోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా కార్మికులు పోరాటం ఫలించిటనట్లైంది. పెండింగ్ జీతాల ఇష్యూను రీసాల్వ్ చేయటంలో దుబాయ్ లేబర్ కోర్టు, మినిస్ట్రి ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ ఎమిరైజేషెషన్ జోక్యం చేసుకోవటంతో సమస్యకు పరిష్కారం దొరికింది. వివరాల్లోకి వెళ్తే..ఓ క్యాటరింగ్ సంస్థ ఆర్ధిక ఒడిదుడుకులతో తమ కార్మికులకు జీతాలు చెల్లించటంలో విఫలమైంది. వెయిటర్స్, కుక్స్, అడ్మినిస్ట్రేటర్స్, డ్రైవర్స్ ఇలా దాదాపు 1000 మంది జీతాలు లేకుండా నెలల తరబడి పని చేశారు. చివరికి బకాయి జీతాల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే 300 మందికి జీతాలు చెల్లించేలా సమస్యను పరిష్కరించిన మొబైల్ కోర్టు..ఇప్పుడు మిగిలిన 762 మంది కార్మికుల రావాల్సిన శాలరీల చెల్లించాలని ఆదేశించింది. కార్మిక చట్టాల మేరకు వర్కర్స్ హక్కులను పరిరక్షిస్తామని జ్యూడిషియల్ అఫిషియల్స్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







