యూఏఈ:పెండింగ్ జీతాల చెల్లింపులో 762 మంది కార్మికులకు ఊరట
- February 25, 2020యూఏఈ:బకాయి జీతాల కోసం నెలల తరబడి న్యాయపోరాటం చేస్తున్న 762 మంది కార్మికులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పెండింగ్ శాలరీల చెల్లింపు కోసం dh20 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా మొబైల్ కోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా కార్మికులు పోరాటం ఫలించిటనట్లైంది. పెండింగ్ జీతాల ఇష్యూను రీసాల్వ్ చేయటంలో దుబాయ్ లేబర్ కోర్టు, మినిస్ట్రి ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ ఎమిరైజేషెషన్ జోక్యం చేసుకోవటంతో సమస్యకు పరిష్కారం దొరికింది. వివరాల్లోకి వెళ్తే..ఓ క్యాటరింగ్ సంస్థ ఆర్ధిక ఒడిదుడుకులతో తమ కార్మికులకు జీతాలు చెల్లించటంలో విఫలమైంది. వెయిటర్స్, కుక్స్, అడ్మినిస్ట్రేటర్స్, డ్రైవర్స్ ఇలా దాదాపు 1000 మంది జీతాలు లేకుండా నెలల తరబడి పని చేశారు. చివరికి బకాయి జీతాల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే 300 మందికి జీతాలు చెల్లించేలా సమస్యను పరిష్కరించిన మొబైల్ కోర్టు..ఇప్పుడు మిగిలిన 762 మంది కార్మికుల రావాల్సిన శాలరీల చెల్లించాలని ఆదేశించింది. కార్మిక చట్టాల మేరకు వర్కర్స్ హక్కులను పరిరక్షిస్తామని జ్యూడిషియల్ అఫిషియల్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు