యూఏఈ:పెండింగ్ జీతాల చెల్లింపులో 762 మంది కార్మికులకు ఊరట
- February 25, 2020
యూఏఈ:బకాయి జీతాల కోసం నెలల తరబడి న్యాయపోరాటం చేస్తున్న 762 మంది కార్మికులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పెండింగ్ శాలరీల చెల్లింపు కోసం dh20 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా మొబైల్ కోర్టు ఆదేశించింది. దీంతో దాదాపు ఏడాది కాలంగా కార్మికులు పోరాటం ఫలించిటనట్లైంది. పెండింగ్ జీతాల ఇష్యూను రీసాల్వ్ చేయటంలో దుబాయ్ లేబర్ కోర్టు, మినిస్ట్రి ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ ఎమిరైజేషెషన్ జోక్యం చేసుకోవటంతో సమస్యకు పరిష్కారం దొరికింది. వివరాల్లోకి వెళ్తే..ఓ క్యాటరింగ్ సంస్థ ఆర్ధిక ఒడిదుడుకులతో తమ కార్మికులకు జీతాలు చెల్లించటంలో విఫలమైంది. వెయిటర్స్, కుక్స్, అడ్మినిస్ట్రేటర్స్, డ్రైవర్స్ ఇలా దాదాపు 1000 మంది జీతాలు లేకుండా నెలల తరబడి పని చేశారు. చివరికి బకాయి జీతాల కోసం కోర్టును ఆశ్రయించారు. గతంలోనే 300 మందికి జీతాలు చెల్లించేలా సమస్యను పరిష్కరించిన మొబైల్ కోర్టు..ఇప్పుడు మిగిలిన 762 మంది కార్మికుల రావాల్సిన శాలరీల చెల్లించాలని ఆదేశించింది. కార్మిక చట్టాల మేరకు వర్కర్స్ హక్కులను పరిరక్షిస్తామని జ్యూడిషియల్ అఫిషియల్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు