ఒమన్ కు విస్తరించిన కరోనా వైరస్..రెండు పాజిటీవ్ కేసులు నమోదు
- February 25, 2020ఒమన్:ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. లేటెస్ట్ గా ఒమన్ లోనూ తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే..వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉందని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు ప్రకటించారు. దీంతో ఒమన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు సాధ్యమైనంత వకు ఇళ్లు వదిలి బయటికి రావొద్దని అధికారులు సూచించారు. అలాగే ఇరాన్ కు తక్షణమే ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్, కువైట్ లో కూడా తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన బహ్రెయిన్ వ్యక్తికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ నుంచి కువైట్ చేరుకున్న ముగ్గురు వైరస్ బారిన పడినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రి తెలిపింది. వైరస్ సోకిన ముగ్గురు సౌదీ పౌరులని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ