ఒమన్ కు విస్తరించిన కరోనా వైరస్..రెండు పాజిటీవ్ కేసులు నమోదు
- February 25, 2020
ఒమన్:ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. లేటెస్ట్ గా ఒమన్ లోనూ తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే..వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉందని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు ప్రకటించారు. దీంతో ఒమన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు సాధ్యమైనంత వకు ఇళ్లు వదిలి బయటికి రావొద్దని అధికారులు సూచించారు. అలాగే ఇరాన్ కు తక్షణమే ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్, కువైట్ లో కూడా తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన బహ్రెయిన్ వ్యక్తికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ నుంచి కువైట్ చేరుకున్న ముగ్గురు వైరస్ బారిన పడినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రి తెలిపింది. వైరస్ సోకిన ముగ్గురు సౌదీ పౌరులని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







