ఒమన్ కు విస్తరించిన కరోనా వైరస్..రెండు పాజిటీవ్ కేసులు నమోదు
- February 25, 2020
ఒమన్:ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా కోవిడ్-19 వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. లేటెస్ట్ గా ఒమన్ లోనూ తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే..వారి హెల్త్ కండీషన్ స్టేబుల్ గానే ఉందని మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు ప్రకటించారు. దీంతో ఒమన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు సాధ్యమైనంత వకు ఇళ్లు వదిలి బయటికి రావొద్దని అధికారులు సూచించారు. అలాగే ఇరాన్ కు తక్షణమే ఫ్లైట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్, కువైట్ లో కూడా తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరాన్ నుంచి వచ్చిన బహ్రెయిన్ వ్యక్తికి వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ నుంచి కువైట్ చేరుకున్న ముగ్గురు వైరస్ బారిన పడినట్లు కువైట్ హెల్త్ మినిస్ట్రి తెలిపింది. వైరస్ సోకిన ముగ్గురు సౌదీ పౌరులని వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







