యూరోలు, దిరామ్స్ని కలిగిన ఓ వ్యక్తి అరెస్ట్..
- January 21, 2016
పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కలిగిన ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రూ. కోటి విలువ గల విదేశీ కరెన్సీ(యూరోలు, దిరామ్స్)ని కలిగిన ఓ వ్యక్తి ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఇంటలిజెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. కాగా కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి తన వెంట 5 వేల యూఎస్ డాలర్స్ను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. వీటితో పాటు మరో 5 వేల డాలర్ల విలువ గల బాండ్లు, చెక్స్ను తీసుకువెళ్లవచ్చు. పరిమితికి మించి నగదును తీసుకువెళ్తుండటంతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









