భారత్ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరిన ట్రంప్‌

- February 26, 2020 , by Maagulf
భారత్ పర్యటన ముగించుకుని అమెరికా బయల్దేరిన ట్రంప్‌

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన విందు అనంతరం ట్రంప్‌, మెలనియా దంపతులు నేరుగా విమానాశ్రయానికి బయల్దేరారు. అనంతరం అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులకు అపూర్వస్వాగతం లభించింది. విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్రంప్‌కు పరిచయం చేశారు. భారత్‌లో తన రెండు రోజుల పర్యటన మధురానుభూతిని కలిగించిందని ట్రంప్‌ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com