బహ్రెయిన్:వెంటాడుతున్న కరోనా వైరస్..మరో 7 కొత్త కేసులు నమోదు
- February 28, 2020
బహ్రెయిన్:ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పుట్టిన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుతున్నా..ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి కింగ్ డమ్ వస్తున్న వారిలోనే ఎక్కువగా వైరస్ బయటపడుతోంది. లేటెస్ట్ మరో ఏడుగురికి కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలింది. దీంతో కింగ్ డమ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 33కి పెరిగింది. కొత్తగా వైరస్ బారిన పడిన ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారే కావటం గమనార్హం. ఇరాన్ నుంచి నేరుగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వీరు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కోవిడ్-19 పాజిటీవ్ అని నిర్ధారణ అయిన వెంటనే వారిని ఇబ్రహీం ఖలీల్ కనూ కమ్యూనిటీ మెడికల్ సెంటర్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా ఎఫెక్టెడ్ పేషేంట్లతో క్లోజ్ మూవ్ అయిన వ్యక్తులను కూడా బయట తిరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







