బహ్రెయిన్:వెంటాడుతున్న కరోనా వైరస్..మరో 7 కొత్త కేసులు నమోదు
- February 28, 2020బహ్రెయిన్:ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పుట్టిన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుతున్నా..ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి కింగ్ డమ్ వస్తున్న వారిలోనే ఎక్కువగా వైరస్ బయటపడుతోంది. లేటెస్ట్ మరో ఏడుగురికి కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలింది. దీంతో కింగ్ డమ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 33కి పెరిగింది. కొత్తగా వైరస్ బారిన పడిన ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారే కావటం గమనార్హం. ఇరాన్ నుంచి నేరుగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వీరు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కోవిడ్-19 పాజిటీవ్ అని నిర్ధారణ అయిన వెంటనే వారిని ఇబ్రహీం ఖలీల్ కనూ కమ్యూనిటీ మెడికల్ సెంటర్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా ఎఫెక్టెడ్ పేషేంట్లతో క్లోజ్ మూవ్ అయిన వ్యక్తులను కూడా బయట తిరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..