బహ్రెయిన్:వెంటాడుతున్న కరోనా వైరస్..మరో 7 కొత్త కేసులు నమోదు
- February 28, 2020
బహ్రెయిన్:ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పుట్టిన చైనాలో వైరస్ తీవ్రత తగ్గుతున్నా..ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నుంచి కింగ్ డమ్ వస్తున్న వారిలోనే ఎక్కువగా వైరస్ బయటపడుతోంది. లేటెస్ట్ మరో ఏడుగురికి కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలింది. దీంతో కింగ్ డమ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 33కి పెరిగింది. కొత్తగా వైరస్ బారిన పడిన ఏడుగురు ఇరాన్ నుంచి వచ్చినవారే కావటం గమనార్హం. ఇరాన్ నుంచి నేరుగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వీరు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కోవిడ్-19 పాజిటీవ్ అని నిర్ధారణ అయిన వెంటనే వారిని ఇబ్రహీం ఖలీల్ కనూ కమ్యూనిటీ మెడికల్ సెంటర్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనా ఎఫెక్టెడ్ పేషేంట్లతో క్లోజ్ మూవ్ అయిన వ్యక్తులను కూడా బయట తిరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
--రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







