ఉమ్రా యాత్రికులను అడ్డుకున్న ఎయిర్పోర్ట్ అధికారులు
- February 29, 2020
కేరళ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పవిత్ర నగరాలు మక్కా, మదీనాల సందర్శనలను సౌదీ అరేబియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇతర దేశాల నుంచి వచ్చే సందర్శకులను ఈ నగరాలకు రాకుండా నిషేధం విధించింది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి చెందిన దేశాల నుండి పర్యాటకులను ఇక్కడికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే గురువారం కాలికట్ నుంచి సౌదీ వెళ్లేందుకు వచ్చిన సుమారు 200 మంది ఉమ్రా యాత్రికులను అధికారులు విమానాల నుంచి కిందకి దించేశారు. సౌదీ ఎయిర్లైన్స్ నుంచి 84 మంది ప్రయాణికులను, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ నుంచి 104 మందిని ఎయిర్పోర్ట్ అధికారులు తిరిగి ఇంటికి పంపించారు.
కాగా, కొంత మంది జెడ్డా వెళ్తున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. కరోనా భయంతో సౌదీ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికులను తాత్కాలికంగా తమ దేశంలోకి అనుమతించడం లేదు. అందుకే సౌదీ వెళ్తున్న కేరళ యాత్రికులను అధికారులు అడ్డుకున్నారు. గల్ఫ్ దేశాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి మక్కా, మదీనా వచ్చే యాత్రిలకులపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా నగరాలకు సౌదీ నిలయం.వీటిని సందర్శించేందుకు ఏడాది పొడవునా లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు.విదేశీ యాత్రికుల కోసం సౌదీ సర్కార్ గత అక్టోబర్లో 49 దేశాలకు కొత్త టూరిజం వీసాను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై సస్పెన్షన్ విధిస్తూ సౌదీ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ సస్పెన్షన్లు తాత్కాలికమైనవని, వీటి గడువుకు ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







