గల్ఫ్ దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ... చమురురంగానికి ఎదురు దెబ్బ..
- March 01, 2020
కరోనా ఈపేరు వింటే ప్రపంచం వణికిపోతున్నది. ఏ దేశంలోకి ఎలా ప్రవేశిస్తుందో తెలియక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్ వలన ప్రపంచంలో దాదాపుగా 60కి పైగా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. మొన్నటి వరకు చైనా వరకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు చైనా నుంచి కొరియా తో పాటు గల్ఫ్ దేశాలలో విస్తరించింది.
గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఇరాన్, కువైట్, లెబనాన్ దేశాలను ఈ వైరస్ ఇబ్బందులు పెడుతున్నది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద 3000 మందికి పైగా మరణించారు. 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గల్ఫ్ దేశాల్లో రోజు రోజుకు ఈ వైరస్ ఎఫెక్ట్ పెరిగిపోతున్నది. దీంతో ప్రపంచదేశాలు అయోమయంలో పడిపోయాయి. గల్ఫ్ లో వైరస్ దెబ్బకు చమురు రంగం కుదేలైంది. ముడి చమురు ధరలు పడిపోతున్నాయి. చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఇరాన్, కువైట్ దేశాలలో కరోనా కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడం మొదలుపెట్టింది. పైగా ప్రజా రవాణను నిలిపివేస్తుండటంతో చమురు ధరలు తగ్గిపోతున్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







