రమదాన్‌ వరకూ కరోనా కల్లోలం?

- March 02, 2020 , by Maagulf
రమదాన్‌ వరకూ కరోనా కల్లోలం?

కువైట్‌: కువైట్‌లో కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య 46కి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడిలో కొత్తగా కరోనా వైరస్‌ని కనుగొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వైరస్‌ తొలిసారిగా దేశంలో కనుగొనబడినప్పటినుంచీ అత్యంత పకడ్బందీగా ఈ వైరస్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరిస్థితి కొంత అదుపులోనే వున్నట్లు కన్పిస్తోంది. పూర్తిగా కరోనా కేసులు జీరో అయ్యేదాకా కరోనాపై పోరాటం ఆగబోదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, త్వరలో రమదాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఐసోలేషన్‌ పద్ధతిలోనే వేడుకలు జరుగుతాయా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కువగా జనం గుమి కూడే అవకాశం వుంటుంది కాబట్టి, ఈలోగా కరోనా పూర్తిగా అంతమైతే తప్ప.. రమదాన్‌ వేడుకల్లో ఈసారి భిన్నమైన పరిస్థితులు వుండొచ్చు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com