2019లో పట్టుబడ్డ 48,000 జేవాకర్స్
- March 02, 2020
అబుధాబి:48,000 మంది పెడెస్ట్రియన్స్ నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటుతూ పట్టుబడ్డారు 2019లో. అబుదాబీకి సంబంధించిన ఈ గణాంకాల్ని పోలీసులు వెల్లడించారు. జేవాకింగ్కి 400 దిర్హామ్ ల జరీమానా విధిస్తున్నారు. ఈ జేవాకింగ్ అనేది ఇటు పాదచారులకీ, అటు వాహనదారులకీ ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెడెస్ట్రియన్స్ తమకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రోడ్డు దాటాలని అధికారులు సూచిస్తున్నారు. మరోపక్క, జేవాకింగ్లోనూ ఫోన్ మాట్లాడుతూ వుండేవారి వల్ల రిస్క్ మరింత పెరుగుతోందని అధికారులు చెప్పారు. పాదచారుల భద్రత కోసం అలాగే వాహనాల ప్రమాదాల్ని నివారించేందుకోసం చాలా ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్స్ని ఏర్పాటు చేయడంతోపాటుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. తగినన్ని సౌకర్యాలు వున్నా, నిర్లక్ష్యపూరితంగా రోడ్లపై ఎక్కడికక్కడ క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







