2019లో పట్టుబడ్డ 48,000 జేవాకర్స్
- March 02, 2020
అబుధాబి:48,000 మంది పెడెస్ట్రియన్స్ నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో రోడ్డు దాటుతూ పట్టుబడ్డారు 2019లో. అబుదాబీకి సంబంధించిన ఈ గణాంకాల్ని పోలీసులు వెల్లడించారు. జేవాకింగ్కి 400 దిర్హామ్ ల జరీమానా విధిస్తున్నారు. ఈ జేవాకింగ్ అనేది ఇటు పాదచారులకీ, అటు వాహనదారులకీ ప్రమాదకరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పెడెస్ట్రియన్స్ తమకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రోడ్డు దాటాలని అధికారులు సూచిస్తున్నారు. మరోపక్క, జేవాకింగ్లోనూ ఫోన్ మాట్లాడుతూ వుండేవారి వల్ల రిస్క్ మరింత పెరుగుతోందని అధికారులు చెప్పారు. పాదచారుల భద్రత కోసం అలాగే వాహనాల ప్రమాదాల్ని నివారించేందుకోసం చాలా ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్స్ని ఏర్పాటు చేయడంతోపాటుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. తగినన్ని సౌకర్యాలు వున్నా, నిర్లక్ష్యపూరితంగా రోడ్లపై ఎక్కడికక్కడ క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







