బహ్రెయిన్ లో మరో 6 కోవిడ్-19 కేసులు
- March 02, 2020
బహ్రెయిన్:కరోనా కోరలు చాచి ప్రపంచదేశాలపై విరుచుకుపడుతూనే ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. బహ్రెయిన్ లో కొత్తగా మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. ఇరాన్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులకు కోవిడ్-19 పాజిటీవ్ వచ్చినట్లు నిర్ధారించారు. ఈ ఆరుగురిలో ఐదుగురు బహ్రెయిన్ కు చెందివారు. మరొకరు సౌదీ పౌరుడు. వాళ్లందర్ని చికిత్స కోసం ఐసోలేటెడ్ వార్డుకు తరలించి స్పెషల్ టీంతో చికిత్స అందిస్తున్నారు. కొత్త నమోదైన ఆరుగురు పేషెంట్లతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 47కి పెరిగింది. ఇప్పటి వరకు 1977 మందికి కోవిడ్-19 టెస్టులు జరిపినట్లు హెల్త్ మినిస్ట్రి ఒక ప్రకటనలో తెలిపింది.
రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా పేషెంట్లను ట్రీట్ చేసేందుకు సమర్ధులైన డాక్టర్లతో స్పెషల్ టీంను
ఏర్పాటు చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసింది. అలాగే టెస్టింగ్ కోసం టైం స్లాట్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఇరాన్ నుంచి వచ్చిన 2,292 మందికి మొబైల్ టెస్టింగ్ చేస్తున్నారు. అలాగే ఇరాన్ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని, వైరస్ టెస్టు రిజల్ట్స్ వచ్చే వరకు జనాల్లో తిరగొద్దని అధికారులు సూచించారు. కోవిడ్-19 టెస్టులు చేసుకునేందుకు www.gov.bh/444 లో వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







