అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన అమరావతి ఉద్యమం
- March 03, 2020
అమరావతి ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరింది. రాజధాని కోసం దీక్షలు, ర్యాలీలు చేస్తున్న వారి పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా NRIలు, నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. రైతులు, మహిళలపై జరుగుతున్న దమనకాండను కోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి NRI విభాగం తరపున శ్రీనివాసరావు కావేటి హేగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని 'హెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ యూనిట్ ప్రాసిక్యూటర్' అకనాలెడ్జ్మెంట్ ఇచ్చారు.
త్వరలో ఇదే అంశంపై జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మావనహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయాలని USAలోని NRIలు నిర్ణయించుకున్నారు. అమరావతిలో మానవ హక్కుల ఉల్లంఘనపై అన్ని వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళల్ని అక్రమ నిర్బంధం, అరెస్ట్లపై పోరాటం కొనసాగిస్తామంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు