జెడ్డా:సౌదీ అరేబియా డేంజర్ బెల్స్..కింగ్ డమ్ కరోనా వైరస్ ఫస్ట్ కేస్
- March 03, 2020
జెడ్డా:ప్రాణంతక కరోనా వైరస్ సౌదీ అరేబియాలోకి కూడా ఎంటర్ అయ్యింది. సోమవారం తొలి కోవిడ్-19 కేసు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. చైనాలో వైరస్ ను గుర్తించిన తర్వాత ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోయాయి. దాదాపు 66 దేశాలకు విస్తరించింది. ఇంతటీ క్రిటికల్ కండీషన్స్ లో కూడా కింగ్ డమ్ లోకి వైరస్ ఎంటర్ కాకుండా సౌదీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా కరోనాపై పోరులో వెనుకబడిపోయింది. చివరికి ఆ మహమ్మారి దేశంలోకి ఎంటరైంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొన్నాళ్లుగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఇరాన్ లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చైనా తర్వాత ఇరాన్ లోనే కోవిడ్-19 మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సౌదీలో నమోదైన కరోనా బాధితుడు కూడా బహ్రెయిన్ మీదుగా ఇరాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్ లో కరోనా రోగుల సంఖ్య 523 నుంచి 1,501 కి పెరిగింది. మృతుల సంఖ్య 54 నుంచి 66కి పెరిగింది. ఇరాన్ లో రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు ఆందోళనకరంగా మారింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు