జెడ్డా:సౌదీ అరేబియా డేంజర్ బెల్స్..కింగ్ డమ్ కరోనా వైరస్ ఫస్ట్ కేస్
- March 03, 2020
జెడ్డా:ప్రాణంతక కరోనా వైరస్ సౌదీ అరేబియాలోకి కూడా ఎంటర్ అయ్యింది. సోమవారం తొలి కోవిడ్-19 కేసు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. చైనాలో వైరస్ ను గుర్తించిన తర్వాత ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోయాయి. దాదాపు 66 దేశాలకు విస్తరించింది. ఇంతటీ క్రిటికల్ కండీషన్స్ లో కూడా కింగ్ డమ్ లోకి వైరస్ ఎంటర్ కాకుండా సౌదీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా కరోనాపై పోరులో వెనుకబడిపోయింది. చివరికి ఆ మహమ్మారి దేశంలోకి ఎంటరైంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొన్నాళ్లుగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఇరాన్ లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చైనా తర్వాత ఇరాన్ లోనే కోవిడ్-19 మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సౌదీలో నమోదైన కరోనా బాధితుడు కూడా బహ్రెయిన్ మీదుగా ఇరాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్ లో కరోనా రోగుల సంఖ్య 523 నుంచి 1,501 కి పెరిగింది. మృతుల సంఖ్య 54 నుంచి 66కి పెరిగింది. ఇరాన్ లో రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు ఆందోళనకరంగా మారింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







