జెడ్డా:సౌదీ అరేబియా డేంజర్ బెల్స్..కింగ్ డమ్ కరోనా వైరస్ ఫస్ట్ కేస్
- March 03, 2020
జెడ్డా:ప్రాణంతక కరోనా వైరస్ సౌదీ అరేబియాలోకి కూడా ఎంటర్ అయ్యింది. సోమవారం తొలి కోవిడ్-19 కేసు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. చైనాలో వైరస్ ను గుర్తించిన తర్వాత ప్రపంచ దేశాలు కరోనాతో అల్లాడిపోయాయి. దాదాపు 66 దేశాలకు విస్తరించింది. ఇంతటీ క్రిటికల్ కండీషన్స్ లో కూడా కింగ్ డమ్ లోకి వైరస్ ఎంటర్ కాకుండా సౌదీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అయినా కరోనాపై పోరులో వెనుకబడిపోయింది. చివరికి ఆ మహమ్మారి దేశంలోకి ఎంటరైంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొన్నాళ్లుగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఇరాన్ లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చైనా తర్వాత ఇరాన్ లోనే కోవిడ్-19 మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సౌదీలో నమోదైన కరోనా బాధితుడు కూడా బహ్రెయిన్ మీదుగా ఇరాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్ లో కరోనా రోగుల సంఖ్య 523 నుంచి 1,501 కి పెరిగింది. మృతుల సంఖ్య 54 నుంచి 66కి పెరిగింది. ఇరాన్ లో రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితులు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు ఆందోళనకరంగా మారింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







