దుబాయ్:ఈ-కామర్స్ వెబ్ సైట్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- March 03, 2020
దుబాయ్:డిజిటల్ ఫ్లాట్ ఫాం బిజినెస్ లో కస్టమర్స్ మోసపోకుండా యూఏఈ మినిస్ట్రి ఆఫ్ ఎకనామీ కన్సూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. యూఏఈ పరిధిలోని ఈ కామర్స్ వెబ్ సైట్స్ అన్నింటిని ఆయా ఎమిరాతి కంట్రీస్ లోని ఎకనామిక్ డిపార్మెంట్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. జీసీసీ 15వ జీసీసీ కన్సూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ సమావేశంలో మినిస్ట్రి ఆఫ్ ఎకనామీ కన్సూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.హసీం అల్ నువామీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ-కామర్స్ బిజినెస్ ను ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావటం ద్వారా వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించటంతో డిజిటల్ ఫ్లాట్ ఫాంపై బిజినెస్ చేసే వారికి మరింత బాధ్యతను పెంపొందించటమే తమ లక్ష్యమని వివరించారు. 2022 నాటికి ఈ-కామర్స్ బిజినెస్ Dh99.45 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కన్సూమర్స్ రైట్స్ కాపాడటంలో భాగంగా డిజిటల్ ఫ్లాట్ ఫాం బిజినెస్ లపై ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







