దుబాయ్:ఈ-కామర్స్ వెబ్ సైట్స్ కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- March 03, 2020
దుబాయ్:డిజిటల్ ఫ్లాట్ ఫాం బిజినెస్ లో కస్టమర్స్ మోసపోకుండా యూఏఈ మినిస్ట్రి ఆఫ్ ఎకనామీ కన్సూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. యూఏఈ పరిధిలోని ఈ కామర్స్ వెబ్ సైట్స్ అన్నింటిని ఆయా ఎమిరాతి కంట్రీస్ లోని ఎకనామిక్ డిపార్మెంట్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. జీసీసీ 15వ జీసీసీ కన్సూమర్ ప్రొటెక్షన్ గ్రూప్ సమావేశంలో మినిస్ట్రి ఆఫ్ ఎకనామీ కన్సూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.హసీం అల్ నువామీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ-కామర్స్ బిజినెస్ ను ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావటం ద్వారా వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించటంతో డిజిటల్ ఫ్లాట్ ఫాంపై బిజినెస్ చేసే వారికి మరింత బాధ్యతను పెంపొందించటమే తమ లక్ష్యమని వివరించారు. 2022 నాటికి ఈ-కామర్స్ బిజినెస్ Dh99.45 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కన్సూమర్స్ రైట్స్ కాపాడటంలో భాగంగా డిజిటల్ ఫ్లాట్ ఫాం బిజినెస్ లపై ప్రభుత్వ పర్యవేక్షణ తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







