హైద్రాబాద్‌లో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు

- March 03, 2020 , by Maagulf
హైద్రాబాద్‌లో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో కరోనా వైరస్‌కి సంబంధించి తొలి పాజిటివ్‌ కేసు నమోదయ్యింది. బాధితుడ్ని 24 ఏళ్ళ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా గుర్తించారు. ఆఫీస్‌ వర్క్‌ నిమిత్తం ఇటీవల దుబాయ్‌కి వెళ్ళి వచ్చిన ఆ వ్యక్తి, అక్కడి నుంచి బెంగళూరుకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. బెంగళూరులో రెండ్రోజులు ఆఫీస్‌కి వెళ్ళాడనీ, ఆ తర్వాత ఆయన హైద్రాబాద్‌ రావడం జరిగిందనీ, జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన అతనికి తొలుత స్వైన్‌ఫ్లూ అనే అనుమానంతో వైద్య చికిత్స అందించగా, ఫలితమివ్వకపోవడంతో గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడే అతనికి కోవిడ్‌ (కరోనా వైరస్‌) పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ అని తేలింది. దుబాయ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు విదేశీయుల్ని కలవడం వల్ల బాధితుడికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఇండియాకి వచ్చిన దగ్గర్నుంచి ఎవరెవర్ని అతను కలిశాడన్నదానిపై ఆరా తీస్తున్న అధికారులు, కొందరికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com