రియాద్:సౌదీలోకి ఎంట్రీ అంత ఈజీ కాదు..బోర్డర్స్ దగ్గర స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్
- March 04, 2020రియాద్:ఇక నుంచి సౌదీ అరేబియాలోకి ఎంట్రీ అవటం అంత ఈజీ కాదు. చివరికి జీసీసీ దేశాల నుంచి వచ్చే వారికి సౌతం సౌదీ విధించిన కండీషన్స్ సాటిస్ ఫై అయితేనే దేశంలోకి ఎంట్రీ దక్కుతుంది. లేదంటే బోర్డర్ దగ్గర్నుంచే రిటర్న్ కావాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో సౌదీ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ కంట్రీస్ నుంచి గల్ఫ్ కంట్రీస్ కు తిరగొచ్చిన వ్యక్తులు ఖచ్చితంగా తమ వివరాలను ఆయా గవర్నరేట్ లో తెలియజేయాల్సి ఉంటుంది. అక్కడ 14 రోజుల పాటు స్టే చేసిన తర్వాత వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ తో వస్తేనే సౌదీలోకి ఎంట్రీకి అనుమతిస్తారు. యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, కువైట్ నుంచి సౌదీకి వెళ్లవారు తప్పనిసరిగా తమ సొంత దేశంలో వరుసగా రెండు వారాలు గడపాల్సిందే. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కోవిడ్-19 మనిషి శరీరంలోకి ఎంటరైనా తొలి 14 రోజులు అంతగా ప్రభావం చూపదు. రెండు వారాల తర్వాతే బ్లడ్ షాంపుల్స్ లో ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. దీంతో కరోనా ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు తమ తమ దేశంలో 14 రోజులు ఉన్నట్లు అధికారిక అధారాలు చూపిస్తేనే బోర్డర్స్ దాటనిచ్చేలా నిబంధనలు విధించారు. ఈ మేరకు గల్ఫ్ దేశాల నుంచి సౌదీలోకి ఎంటరయ్యే సరిహద్దు రహదారుల్లో తనఖీలను ముమ్మరం చేశారు. ఏ మాత్రం సందేహం ఉన్నా..వాళ్లను తిప్పి పంపించేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!