కరోనా అలర్ట్:దుబాయ్ లో ఇండియన్ స్కూల్ స్టూడెంట్ కి కరోనా
- March 05, 2020
దుబాయ్ లో ఇండియన్ స్కూల్ లో 16 ఏళ్ల బాలుడికి కరోనా టెస్టులో పాజిటీవ్ వచ్చింది. ఓవర్సీస్ నుంచి తిరిగి వచ్చిన తన తండ్రి నుంచి బాలుడికి కోవిడ్-19 సోకింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఐదు రోజుల తర్వాత అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అతనికి బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయటంతో వైరస్ ఉన్నట్లు తేలింది. అతని కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయటంతో 16 ఏళ్ల బాలుడికి కూడా పాజిటీవ్ వచ్చింది. దీంతో ఎన్ఆర్ఐ ఫ్యామిలీని అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. లేటెస్ట్ కేసుతో అలర్టైన దుబాయ్ హెల్త్ అథారిటీ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ప్రివెంటీవ్ మెజర్స్ పై ఫోకస్ చేస్తున్నారు. కరోనా ఇన్ ఫెక్టెడ్ స్టూడెంట్ చదువుతున్న ఇండియన్ స్కూల్ కు సెలవులు ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు స్కూల్ లో శానిటైజేషన్ చేపట్టారు. అలాగే స్కూల్ లో చదువుతున్న స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఫ్యామిలీస్, స్కూల్ స్టాఫ్ హెల్త్ కండీషన్ ను మానిటర్ చేస్తున్నారు. వాళ్లందరికీ కోవిడ్-19 టెస్టులు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!