జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్నవారికి శుభవార్త...
- March 05, 2020భారత్ దేశంలో అధిక సంఖ్యలో ఇన్సూరెన్స్ సంస్థలు ఉన్నా పాలసీలు తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. లైఫ్, యాక్సిడెంట్, హెల్త్ ఇలా పలు రకాల పాలసీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనే పేరు వినగానే మొదట మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పేరు గుర్తొస్తుంది.
దేశంలో అతి పెద్ద భీమా సంస్థగా ఎల్ఐసీకు గుర్తింపు ఉంది. మనం LIC ద్వారా 30,000 రూపాయల ఉచిత ఇన్సూరెన్స్ డబ్బులు పొందవచ్చు. ఈ బీమా కొరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి 30,000 రూపాయల వరకు ఉచిత జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ భీమా అన్ని బ్యాంక్ అకౌంట్లకు వర్తించదు. కేవలం జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి 30,000 రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. పాలసీదారుడు చనిపోతే నామినీకి భీమా డబ్బులు అందుతాయి. గతంలో జన్ ధన్ యోజన అకౌంట్లు ఓపెన్ చేసిన వారు మాత్రమే ఈ భీమా ప్రయోజనాన్ని పొందవచ్చు. 2014 ఆగస్ట్ 15 నుండి 2015 జనవరి 26లోపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు రూపే కార్డు ఉన్నవారికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. జన్ ధన్ అకౌంట్ తెరిచిన వారు మరణిస్తే నామినీకి డబ్బులు వస్తాయి. ఖాతాదారుడు ఎలా మరణించినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ