స్పోర్ట్స్ లో పాల్గొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

- March 05, 2020 , by Maagulf
స్పోర్ట్స్ లో పాల్గొన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

సైబరాబాద్:సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 2వ రోజూ కొనసాగిన సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2020. ఈ క్రీడల్లో ఉత్సాహంగా  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మరియు సిబ్బంది. 

బాలానగర్ జోన్ వర్సెస్ సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య హోరాహోరీగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ విన్నర్ గా నిలవగా బాలానగర్ జోన్ రన్నర్ గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కానిస్టేబుల్ నరేశ్ నిలిచారు. 
మాదాపూర్ జోన్ వర్సెస్ సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్ లో  సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ విన్నర్ గా నిలవగా మాదాపూర్ జోన్ రన్నర్ గా నిలిచింది. 
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, ఏసీపీ సంతోష్ కుమార్, ఏసీపీ రవిచంద్ర, ఆర్ ఐ మట్టయ్య, సురేశ్, హిమకర్, సుమన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com