యూఏఈ:విదేశాల నుంచి తిరిగొచ్చే వారు ప్రివేంటీవ్ మెజర్స్ ఫేస్ చేయాల్సిందే..
- March 05, 2020
యూఏఈ:పలు దేశాల్లో కోవిడ్-19 వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఫారెన్ పర్యటనలు మానుకోవాలని యూఏఈ తమ రెసిడెన్స్ కి సూచించింది. ఈ మేరకు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే మళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రివెన్షన్ మెజర్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రిటర్న్ జర్నీలోనే మెడికల్ చెకప్ చేయించుకోవటంతో పాటు, 14 రోజులు ఇంట్లోనే ఉండాలన్నారు. ఒకవేళ కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలితే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలిస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితో వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు MoHAP తెలిపింది. ఫ్లైట్స్, షిప్స్, వెహికిల్స్ ఇలా అన్ని మార్గాల్లోనూ బోర్డర్ క్రాస్ అయ్యే దగ్గర కోవిడ్ -19 టెస్టులు నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు..వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







