యూఏఈ:విదేశాల నుంచి తిరిగొచ్చే వారు ప్రివేంటీవ్ మెజర్స్ ఫేస్ చేయాల్సిందే..
- March 05, 2020
యూఏఈ:పలు దేశాల్లో కోవిడ్-19 వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఫారెన్ పర్యటనలు మానుకోవాలని యూఏఈ తమ రెసిడెన్స్ కి సూచించింది. ఈ మేరకు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే మళ్లి తిరిగి వచ్చే సమయంలో ప్రివెన్షన్ మెజర్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రిటర్న్ జర్నీలోనే మెడికల్ చెకప్ చేయించుకోవటంతో పాటు, 14 రోజులు ఇంట్లోనే ఉండాలన్నారు. ఒకవేళ కోవిడ్-19 టెస్టులో పాజిటీవ్ అని తేలితే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలిస్తామని వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే వారితో వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు MoHAP తెలిపింది. ఫ్లైట్స్, షిప్స్, వెహికిల్స్ ఇలా అన్ని మార్గాల్లోనూ బోర్డర్ క్రాస్ అయ్యే దగ్గర కోవిడ్ -19 టెస్టులు నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు..వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు