చైనా నుంచి ఎమిరేట్స్ హ్యమానిటేరియన్ సిటీకి చేరుకున్న 215 మంది
- March 05, 2020
అబుధాబి: చైనాలోని వుహాన్ సిటీ నుంచి అరబ్ జాతీయుల్ని తరలించే కార్యక్రమాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కో-ఆర్డినేట్ చేసింది.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీవ్ు కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, చైనాలోని వుహాన్ సిటీ నుంచి అరబ్ జాతీయుల్ని రప్పించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రత్యేక విమానంలో వారందరినీ తరలించారు. అలా వచ్చినవారిని యూఏఈలోని ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీకి తరలించారు. అక్కడ వారికి అవసరమైన వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రత్యేక విమానంలో 215 మందిని తీసుకొచ్చారు. ఇందుకోసం విమానాకి హెచ్ఇపిఎ క్యాబిన్ ఎయిర్ ఫిల్ట్రేషన్స్ సిస్టమ్స్ అమర్చారు. అవసరమైన వైద్య పరికరాల్ని కూడా అందుబాటులో వుంచారు. ఇక, వచ్చినవారికి 14 రోజుల క్వారింటైన్ పీరియడ్ వుంటుంది. కేవలం 48 గంటల్లోనే ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







