చైనా నుంచి ఎమిరేట్స్ హ్యమానిటేరియన్ సిటీకి చేరుకున్న 215 మంది
- March 05, 2020
అబుధాబి: చైనాలోని వుహాన్ సిటీ నుంచి అరబ్ జాతీయుల్ని తరలించే కార్యక్రమాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కో-ఆర్డినేట్ చేసింది.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీవ్ు కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, చైనాలోని వుహాన్ సిటీ నుంచి అరబ్ జాతీయుల్ని రప్పించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రత్యేక విమానంలో వారందరినీ తరలించారు. అలా వచ్చినవారిని యూఏఈలోని ఎమిరేట్స్ హ్యుమానిటేరియన్ సిటీకి తరలించారు. అక్కడ వారికి అవసరమైన వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రత్యేక విమానంలో 215 మందిని తీసుకొచ్చారు. ఇందుకోసం విమానాకి హెచ్ఇపిఎ క్యాబిన్ ఎయిర్ ఫిల్ట్రేషన్స్ సిస్టమ్స్ అమర్చారు. అవసరమైన వైద్య పరికరాల్ని కూడా అందుబాటులో వుంచారు. ఇక, వచ్చినవారికి 14 రోజుల క్వారింటైన్ పీరియడ్ వుంటుంది. కేవలం 48 గంటల్లోనే ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







