దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్‌

- March 05, 2020 , by Maagulf
దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్‌

దుబాయ్‌:రెండు దొంగతనం కేసులకు సంబంధించి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిందితుడు దుబాయ్‌లోని ఓ విల్లా నుంచి 8,000 దిర్హాములు  దొంగతనం చేశాడు. అయితే, ఇలాంటిదే ఇంకో నేరం చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడు. రెండోసారి దొంగతనం చేస్తున్న సమయంలో మాస్క్‌ ధరించకపోవడంతో నిందితుడ్ని గుర్తుపట్టడం తేలికయ్యింది. అవకాశం చూసుకుని దొంగతనాలు చేయడం నిందితుడికి అలవాటుగా మారిందని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు దొంగతనాలు చేసిన సమయంలో ఒకే తరహా దుస్తుల్ని నిందితుడు ధరించాడు. నిందితుడ్ని పాకిస్తానీ వ్యక్తిగా గుర్తించారు. ఈ కేసు విచారణ మార్చి 22వ తేదీకి వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com