కరోనా ఎఫెక్ట్ : ప్రార్ధన సమయం 10 నిమిషాలు మించొద్దు..యూఏఈ సర్క్యూలర్

- March 06, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్ : ప్రార్ధన సమయం 10 నిమిషాలు మించొద్దు..యూఏఈ సర్క్యూలర్

యూఏఈ:కరోనా ఎఫెక్ట్ తో ఫ్రైడే ప్రార్ధనల సమయాన్ని ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ కుదించింది. కేవలం పది నిమిషాల్లో ఖచ్చితంగా ప్రేయర్ ముగించాలని యూఏఈలోని అన్ని మసీదుల్లోని ఇమామ్ లకు సర్క్యూలర్ జారీ చేసింది. జనసమూహం ఉండే ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ సర్క్యూలర్ ప్రార్ధన విధానంపై డైరెక్షన్స్ ఇచ్చారు. ఇమామ్‌లు పవిత్ర ఖురాన్ లోని రెండు శ్లోకాలను మాత్రమే చదవాలని, ప్రసంగ లేఖలో పేర్కొన్న ఖచ్చితమైన ప్రసంగం, దువాను చదవాలని క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన 10 నిమిషాలకు మించరాదని, ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com