పవిత్ర మక్కా మసీదులో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్ అనౌన్స్
- March 06, 2020
సౌదీ అరేబియా:పవిత్ర మక్కా, మదీనా మసీదులో ప్రార్ధనలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మదీనాలో ప్రవక్త మసీదుతో పాటు మక్కా మసీదుల ఓపెనింగ్, క్లోజింగ్ షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ రెండు మసీదులను సాయంత్రం ప్రార్ధనల తర్వాత గంట తర్వాత మూసివేయనున్నారు. అలాగే ఉదయం ప్రార్ధనకు గంట ముందు మసీదులోకి భక్తులను అనుమతించనున్నారు. అలాగే పవిత్ర కాబాతో పాటు సఫా, మార్వాహ్ మధ్య సయీకి భక్తులను ఎవర్ని అనుమతించబోమని వెల్లడించారు. ఉమ్రా ప్రార్ధనలపై నిషేధం ఎత్తివేసే వరకు మసీదులో అంతర్గత ప్రార్ధనలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవిత్ర మక్కా, మదీన మసీదుల్లో ప్రార్ధన విరామ సమయంలో క్లీన్ నెస్ మేయిన్టేన్ చేయటంతో పాటు స్టెరిలైజేషన్ చేసేందుకే ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ అనౌన్స్ చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే ఎడాదిలో నిర్వహించే పవిత్ర ఉమ్రా యాత్రపై సౌదీ ప్రభుత్వం మార్చి 4 నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా జీసీసీలో ఆరు గల్ఫ్ దేశాలతో పాటు మక్కా, మదీనా సందర్శించాలనుకునే ఇతర దేశాల భక్తుల వీసాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







