పవిత్ర మక్కా మసీదులో ప్రార్ధనలపై కరోనా ఎఫెక్ట్..ఓపెనింగ్, క్లోజింగ్ టైమ్స్ అనౌన్స్
- March 06, 2020
సౌదీ అరేబియా:పవిత్ర మక్కా, మదీనా మసీదులో ప్రార్ధనలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. మదీనాలో ప్రవక్త మసీదుతో పాటు మక్కా మసీదుల ఓపెనింగ్, క్లోజింగ్ షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ప్రకటించారు. ఈ రెండు మసీదులను సాయంత్రం ప్రార్ధనల తర్వాత గంట తర్వాత మూసివేయనున్నారు. అలాగే ఉదయం ప్రార్ధనకు గంట ముందు మసీదులోకి భక్తులను అనుమతించనున్నారు. అలాగే పవిత్ర కాబాతో పాటు సఫా, మార్వాహ్ మధ్య సయీకి భక్తులను ఎవర్ని అనుమతించబోమని వెల్లడించారు. ఉమ్రా ప్రార్ధనలపై నిషేధం ఎత్తివేసే వరకు మసీదులో అంతర్గత ప్రార్ధనలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవిత్ర మక్కా, మదీన మసీదుల్లో ప్రార్ధన విరామ సమయంలో క్లీన్ నెస్ మేయిన్టేన్ చేయటంతో పాటు స్టెరిలైజేషన్ చేసేందుకే ఓపెనింగ్, క్లోజింగ్ టైమింగ్స్ అనౌన్స్ చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే ఎడాదిలో నిర్వహించే పవిత్ర ఉమ్రా యాత్రపై సౌదీ ప్రభుత్వం మార్చి 4 నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా జీసీసీలో ఆరు గల్ఫ్ దేశాలతో పాటు మక్కా, మదీనా సందర్శించాలనుకునే ఇతర దేశాల భక్తుల వీసాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







