చంద్రబాబు దావోస్ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ కి లాభం ....
- January 22, 2016
దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగో రోజు బిజీబిజీగా గడిచింది. శుక్రవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యవసాయంలో కొత్త దృక్కోణం, కార్యాచరణపై చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం చేపట్టిన.. రైతు సాధికార సంఘం, రైతు రుణాల విముక్తి, ఇన్పుట్ సబ్సిడీ, కరవురహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు..ఫామ్పాండ్స్, నదుల అనుసంధానం గురించి వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు.. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం..వాణిజ్యపరంగా నిలదొక్కుకునేలా చూడటం వంటి అంశాలలో ఏపీతో భాగస్వామి కావాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు..రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







