చంద్రబాబు దావోస్‌ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ కి లాభం ....

- January 22, 2016 , by Maagulf
చంద్రబాబు దావోస్‌ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ కి లాభం ....

దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నాలుగో రోజు బిజీబిజీగా గడిచింది. శుక్రవారం ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో వ్యవసాయంలో కొత్త దృక్కోణం, కార్యాచరణపై చర్చాగోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం చేపట్టిన.. రైతు సాధికార సంఘం, రైతు రుణాల విముక్తి, ఇన్‌పుట్ సబ్సిడీ, కరవురహిత రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రయత్నాలు..ఫామ్‌పాండ్స్, నదుల అనుసంధానం గురించి వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అభినందనలు వెల్లువెత్తాయి. ఈ మేరకు.. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం..వాణిజ్యపరంగా నిలదొక్కుకునేలా చూడటం వంటి అంశాలలో ఏపీతో భాగస్వామి కావాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు..రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com