ఉమ్రా బ్యాన్ తర్వాత తొలి ఫ్రైడే ప్రేయర్స్
- March 07, 2020
మక్కా:మక్కా మరియు మదీనాలోనిలోని గ్రాండ్ మాస్క్ వద్ద ముస్లింలు శుక్రవారం ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మక్కా మరియు మదీనాలో మాస్క్ వద్ద కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఉమ్రా బ్యాన్ తర్వాత జరిగిన తొలి శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా అవాద్ అల్ జుహాని మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తిని నిరోధించే విధంగా షరియత్ చట్టానికి లోబడి అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని అన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా తాత్కాలికంగా కాబా ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. హిల్స్ ఆఫ్ సాఫా మరియు మర్వాలో కూడా నిషేధాజ్జలు అమలు చేశారు. మదీనాలోని ప్రొఫెట్ మాస్క్లోగల సేక్రెడ్ ఛాంబర్ని కూడా మూసివేయడం జరిగింది. కాగా, టూరిజం సెక్టార్ సహా అనేక విభాగాలు వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలిక నిషేధం విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







