ఉమ్రా బ్యాన్ తర్వాత తొలి ఫ్రైడే ప్రేయర్స్
- March 07, 2020
మక్కా:మక్కా మరియు మదీనాలోనిలోని గ్రాండ్ మాస్క్ వద్ద ముస్లింలు శుక్రవారం ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మక్కా మరియు మదీనాలో మాస్క్ వద్ద కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఉమ్రా బ్యాన్ తర్వాత జరిగిన తొలి శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా అవాద్ అల్ జుహాని మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తిని నిరోధించే విధంగా షరియత్ చట్టానికి లోబడి అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని అన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా తాత్కాలికంగా కాబా ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. హిల్స్ ఆఫ్ సాఫా మరియు మర్వాలో కూడా నిషేధాజ్జలు అమలు చేశారు. మదీనాలోని ప్రొఫెట్ మాస్క్లోగల సేక్రెడ్ ఛాంబర్ని కూడా మూసివేయడం జరిగింది. కాగా, టూరిజం సెక్టార్ సహా అనేక విభాగాలు వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలిక నిషేధం విధించడం జరిగింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







