ఉమ్రా బ్యాన్ తర్వాత తొలి ఫ్రైడే ప్రేయర్స్
- March 07, 2020
మక్కా:మక్కా మరియు మదీనాలోనిలోని గ్రాండ్ మాస్క్ వద్ద ముస్లింలు శుక్రవారం ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మక్కా మరియు మదీనాలో మాస్క్ వద్ద కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టిన విషయం విదితమే. ఉమ్రా బ్యాన్ తర్వాత జరిగిన తొలి శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా అవాద్ అల్ జుహాని మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తిని నిరోధించే విధంగా షరియత్ చట్టానికి లోబడి అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని అన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా తాత్కాలికంగా కాబా ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. హిల్స్ ఆఫ్ సాఫా మరియు మర్వాలో కూడా నిషేధాజ్జలు అమలు చేశారు. మదీనాలోని ప్రొఫెట్ మాస్క్లోగల సేక్రెడ్ ఛాంబర్ని కూడా మూసివేయడం జరిగింది. కాగా, టూరిజం సెక్టార్ సహా అనేక విభాగాలు వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలిక నిషేధం విధించడం జరిగింది.
తాజా వార్తలు
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!







