కరోనా ఎఫెక్ట్: 9 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన సౌదీ
- March 09, 2020
రియాద్: కొవిడ్-19(కరోనా)ను అదుపులోకి తెచ్చేందుకు సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీలో కరోనా వ్యాపించకుండా, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది దేశాల నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిలిపివేత ప్యాసెంజర్లపై కూడా ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధించిన దేశాల్లో 14 రోజుల ముందు నుంచి ఉన్న వారెవరు దేశంలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. దీంతో సౌదీ, తొమ్మిది దేశాల మధ్య ప్యాసెంజర్లకు అంతరాయం కలగనుంది. ఎయిర్లైన్స్తో పాటు బోటు ప్రయాణాలపై కూడా ఈ నిషేధమున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. షిప్పింగ్, వాణిజ్య, ఇతరుల తరలింపు వంటి వాటిని మాత్రం ఈ నిలిపివేత నుంచి మినాహాయిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిషేధించిన దేశాల జాబితాలో.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, లెబనాన్, సిరియా, సౌత్ కొరియా, ఈజిప్ట్, ఇటలీ మరియు ఇరాక్ దేశాలు ఉన్నాయి. కరోనా వైరస్ను అదుపులోకి తెచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం ఇలా తాత్కాలికంగా రాకపోకలను నిషేధించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. కీలక సమయాల్లో మాత్రం ప్రభుత్వం కొందరి రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు