కరోనా ఎఫెక్ట్: 14 దేశాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించిన ఖతార్
- March 09, 2020
దోహా (ఖతార్): కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో 14 దేశాలకు చెందిన విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధిస్తూ ఖతార్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాపించకుండా నివారించేందుకు ముందుజాగ్రత్త చర్యగా భారత్ తోపాటు 14 దేశాలకు చెందిన విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించామని ఖతార్ దేశం ప్రకటించింది. చైనా, ఈజిప్టు, భారత్, ఇరాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, ఫిలిఫ్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్ లాండ్ దేశాల నుంచి అన్ని విమానాల రాకపోకలను నిషేధించామని ఖతార్ వివరించింది. కరోనా వైరస్ ప్రబలిన ఇటలీ దేశం నుంచి ఖతార్ దేశానికి విమానాల రాకపోకలను ఖతార్ ఎయిర్ వేస్ గతంలోనే నిషేధించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు