సౌదీ నుంచి వస్తూ ఒమాన్ లో చిక్కుకున్న తెలుగోళ్లు

- March 10, 2020 , by Maagulf
సౌదీ నుంచి వస్తూ ఒమాన్ లో చిక్కుకున్న తెలుగోళ్లు

అనంతపురం జిల్లా కదిరి, చిత్తూరు జిల్లా కురబలకోట, అంగళ్లు, మదనపల్లె తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది వరకు ముస్లింలు పవిత్ర మక్కా సందర్శనార్థం గత నెల 24న బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సోమవారం ఉదయం జెద్దాలోని కింగ్‌ ఖలీద్‌ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం బయలుదేరిన కొద్దిసేపటికి అందులోని ఓ ఇద్దరు ఇతర ప్రయాణికులకు జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు జరిపి.. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో ఒమన్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసినట్లు వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com