కువైట్: వైరస్ అటాక్ అయినా సీక్రసీ మెయిన్టేన్ చేస్తే ఫైన్..ఎంపీల సూచన
- March 11, 2020
కువైట్:కరోనా వైరస్ అటాక్ అయినా..ఎవరికి చెప్పకుండా సీక్రసీ మెయిన్టేన్ చేసే వారిపట్ల కొంత కఠినంగా ఉండాలని కువైట్ ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో ఇతర డిసిసెస్ ను దాటిపెడితే వారికి ఫైన్ విధించాలని ఎంపీలు సూచించారు. ఈ మేరకు హెల్త్ యాక్ట్ లో తగిన సవరణలు చేపట్టాలని కూడా తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖలెద్ అల్ హమద్ అల్ సబా ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై పోరాటానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రులు, ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలువురు ఎంపీలు డిసీస్ వచ్చినట్లు తెలిసినా దాన్ని దాచే ప్రయత్నం చేసే వారికి ఫైన్ విధించాలని అభిప్రాయపడ్డారు. తద్వారా జనం వైరస్ సోకగానే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకునే దిశగా ఫలితాలు సాధించొచ్చని సజిషన్ చేశారు. సమావేశం వివరాలను వెల్లడించిన స్పీకర్..కువైట్ లోని అన్ని స్టేట్ ఎజెన్సీలు కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమియిస్తున్నాయని వెల్లడించారు. సమిష్టి చర్యలు, తక్షణ నిర్ణయాలతో కరోనా వైరస్ పై కువైట్ ప్రజలు విజయం సాధిస్తారని స్పీకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







