కరోనా అలర్ట్:పవిత్ర మక్కా మసీదులో టచ్ స్క్రీన్ సేవల నిలిపివేత
- March 11, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు పవిత్ర మక్కా మసీదు, మదీనా మసీదులో ప్రార్ధనలకు వచ్చే భక్తులకు వైరస్ సోకకుండా ప్రార్ధన మందిరాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే జనరల్ ప్రెసిడెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మక్కా మసీదులో ఏర్పాటు చేసిన ఇంటరాక్టీక్ ఎడ్యూకేషన్ టచ్ స్క్రీన్ సేవలను కూడా నిలిపివేసింది. టచ్ స్క్రీన్ ను ముట్టుకోవటం ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునట్లు వెల్లడించారు. అయితే..రిమోట్ కంట్రోల్ ఆపరేట్ ద్వారా కొంత మేర డిజిటల్ కంటెంట్ చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే ప్రెసిడెన్సీస్ పోర్టల్స్, ఫిక్స్ డ్ డిస్ ప్లేల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని డైరెక్టర్ వివరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







