కరోనా అలర్ట్:పవిత్ర మక్కా మసీదులో టచ్ స్క్రీన్ సేవల నిలిపివేత
- March 11, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన సౌదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అటు పవిత్ర మక్కా మసీదు, మదీనా మసీదులో ప్రార్ధనలకు వచ్చే భక్తులకు వైరస్ సోకకుండా ప్రార్ధన మందిరాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించే జనరల్ ప్రెసిడెన్సీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మక్కా మసీదులో ఏర్పాటు చేసిన ఇంటరాక్టీక్ ఎడ్యూకేషన్ టచ్ స్క్రీన్ సేవలను కూడా నిలిపివేసింది. టచ్ స్క్రీన్ ను ముట్టుకోవటం ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునట్లు వెల్లడించారు. అయితే..రిమోట్ కంట్రోల్ ఆపరేట్ ద్వారా కొంత మేర డిజిటల్ కంటెంట్ చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే ప్రెసిడెన్సీస్ పోర్టల్స్, ఫిక్స్ డ్ డిస్ ప్లేల ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చని డైరెక్టర్ వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..