గల్ఫ్ జెఏసి కన్వీనర్ గా గుగ్గిళ్ల రవిగౌడ్
- March 11, 2020
తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ (గల్ఫ్ జెఏసి) కన్వీనర్ గా ప్రముఖ ప్రవాసి కార్మిక నాయకుడు గుగ్గిళ్ల రవిగౌడ్ ఎన్నికయ్యారు. వివిధ దేశాల నుండి వచ్చిన తెలంగాణ ప్రవాసి సంఘాల ప్రతినిధులు, రాష్ట్రములోని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు మంగళవారం (10.03.2020) రాత్రి జగిత్యాలలో సమావేశమై గల్ఫ్ జెఏసి ని ఏర్పాటు చేసుకున్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రవాసీ విధానం (ఎన్నారై పాలసీ) ప్రవేశపెట్టే విధంగా పనిచేయడమే గల్ఫ్ జెఏసి ఉద్దేశమని రవిగౌడ్ అన్నారు. ఈ శాసన సభ, శాసన మండలి సమావేశాలలో ప్రవాసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ బిల్ ప్రవేశపెట్టి చట్టం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కోర్ కమిటీ
నెరువుట్ల బాబు స్వామి, గాజుల సంపత్, సముద్రాల శ్రీనివాస్, సుందరగిరి శంకర్ గౌడ్, గాoదరి సత్యనారాయణ, స్వదేశ్ పరికిపండ్ల, గోలి శ్రీనివాస్ లతో తాత్కాలిక కోర్ కమిటీని ఎన్నుకున్నారు. విదేశాలలోని, రాష్ట్రంలోని అన్ని సంఘాలను సంప్రదించి గల్ఫ్ జెఏసి ని విస్తరిస్తామని రవిగౌడ్ తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







