గల్ఫ్ జెఏసి కన్వీనర్ గా గుగ్గిళ్ల రవిగౌడ్
- March 11, 2020
తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ (గల్ఫ్ జెఏసి) కన్వీనర్ గా ప్రముఖ ప్రవాసి కార్మిక నాయకుడు గుగ్గిళ్ల రవిగౌడ్ ఎన్నికయ్యారు. వివిధ దేశాల నుండి వచ్చిన తెలంగాణ ప్రవాసి సంఘాల ప్రతినిధులు, రాష్ట్రములోని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు మంగళవారం (10.03.2020) రాత్రి జగిత్యాలలో సమావేశమై గల్ఫ్ జెఏసి ని ఏర్పాటు చేసుకున్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రవాసీ విధానం (ఎన్నారై పాలసీ) ప్రవేశపెట్టే విధంగా పనిచేయడమే గల్ఫ్ జెఏసి ఉద్దేశమని రవిగౌడ్ అన్నారు. ఈ శాసన సభ, శాసన మండలి సమావేశాలలో ప్రవాసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ బిల్ ప్రవేశపెట్టి చట్టం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కోర్ కమిటీ
నెరువుట్ల బాబు స్వామి, గాజుల సంపత్, సముద్రాల శ్రీనివాస్, సుందరగిరి శంకర్ గౌడ్, గాoదరి సత్యనారాయణ, స్వదేశ్ పరికిపండ్ల, గోలి శ్రీనివాస్ లతో తాత్కాలిక కోర్ కమిటీని ఎన్నుకున్నారు. విదేశాలలోని, రాష్ట్రంలోని అన్ని సంఘాలను సంప్రదించి గల్ఫ్ జెఏసి ని విస్తరిస్తామని రవిగౌడ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







