రజనీకాంత్ మీడియా సమావేశం
- March 12, 2020
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయింది. త్వరలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. సీఎం పదవిపై తనకు వ్యామోహం లేదని...పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్పారు. గురువారం (మార్చి 12, 2020) మక్కల్ మండ్రం ఆఫీస్ బేరర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదన్నారు.
వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థను మార్చకుండా మార్పు రాదన్నారు. వ్యవస్థను మార్చకుండా మార్పు రావాలనుకోవడం సరికాదన్నారు. చాలా మంది తనను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశలేదన్నారు. 1996కి ముందు రాజకీయాల గురించి ఆలోచించలేదని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తా అని రెండేళ్ల క్రితం మొదటిసారి చెప్పానని పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్నారు. తన పార్టీలో 65 శాతం సీట్లు యువకులకే అన్నారు. పదవుల కోసం పనిచేసే వారు తనకు అసవరం లేదన్నారు. పాలిటిక్స్ ను పార్టీలు వ్యాపారంలా మార్చేశాయన్నారు. రాజకీయ నాయకులకు ప్రజలు కాదు...ఓట్లే ముఖ్యమని తెలిపారు. జయలలిత మృతితో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొందన్నారు.
అత్యధిక మంది పార్టీలో భాగస్వాములు అయ్యేలా చూసుకుంటాని అన్నారు. వనరుల దుర్వినియోగం పార్టీలో ఉండదన్నారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయన్నారు. నిజాయితీపరులకే సీఎం స్థానం దక్కాలని... తాను పార్టీ అధ్యక్షుడిగానే ఉంటానని తెలిపారు. పార్టీని గెలిపిస్తానని...వేరేవారిని సీఎంను చేస్తానని చెప్పారు. రిటైర్డ్ ఐఏస్, ఐపీఎస్లని పార్టీలలోకి ఆహ్వానిస్తానని అన్నారు. అన్నీ పార్టీలలో 50 ఏళ్ళకి పైబడిన వారే ఉన్నారని.. యువతకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







