శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు

- March 14, 2020 , by Maagulf
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు

హైదరాబాద్:శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో ఇద్దరు కరోనా అనుమానితులు వచ్చారు. మలేషియా, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు, అనుమానితులను ప్రత్యేక వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కరోనా అనుమానితులను తరలించేందుకు  వైద్య ఆరోగ్యశాఖ అంబులెన్స్‌లను సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అనంతగిరికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి అంబులెన్స్‌లను అధికారులు రప్పించారు. జిల్లాల నుంచి కోఠి డీఎంఈ కార్యాలయానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. అవసరమైతే ప్రైవేట్ అంబులెన్స్‌లు వాడుకోవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com