భక్తులకు విజ్ఞప్తి..షిర్డీ కి రాకండి..

- March 16, 2020 , by Maagulf
భక్తులకు విజ్ఞప్తి..షిర్డీ కి రాకండి..

ప్రస్తుతం అత్యధిక కరోనా వైరస్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకొంటోంది. విద్యా సంస్థల నుంచి సినిమాల వరకు బంద్‌ చేసిన ప్రభుత్వం. ఎక్కువ మంది గుమిగూడే షోలను కూడా రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్పందనగా షిర్డికి కొన్నాళ్ళు రావొద్దని షిర్డిసాయి భక్తలను శ్రీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ కోరింది. కొన్నాళ్ళు పాటు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సంస్థాన్‌ ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అరుణ్‌ దొగ్రే అన్నారు. మహారాష్ట్రలోని పలు దేవాలయాల్లో భక్తులకు మాస్క్‌లు తప్పనిసరి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com