దుబాయ్: ఆత్మహత్య చేసుకొని మరణించిన తెలంగాణ కార్మికుడు
- March 16, 2020
మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC)
దుబాయ్: మెదక్ జిల్లా, హవేలీ గన్పూర్ మండలం, బూరుగుపల్లి గ్రామానికి చెందిన మరేల్లి పెరుమయ్య అనే కార్మికుడు మార్చి 3 వ తేదీన దుబాయి రావటం జరిగింది. అనుకోని కారణాల వల్ల మార్చి 10 వ తేదీన రెండు అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని అక్కడికక్కడే మరణించడం జరిగింది.
తోటి కార్మికులు ఈ విషయాన్ని 'గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC)' అధ్యక్షుడు గుండెల్లి నర్సింహాకి తెలపడంతో వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకొని మరియు కంపెనీ మేనేజ్మెంట్ తో మట్లాడి కంపెనీ పూర్తి సహకారంతో అన్ని ఫార్మాలిటిస్ దగ్గరుండి పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియా పంపించడం జరిగింది. మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది. అంతేకాకుండా, మానవతా దృక్పధంతో ఒక వ్యక్తిని కూడ మృతదేహం వెంట ఇండియా పంపించడం జరిగింది.

మృతదేహాన్ని ఇండియా కి తరలించడం లో సహకరించినవారు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షులు గుండేల్లి నర్సింహా ఉపాధ్యక్షులు శేఖర్ గౌడ్, దొనకంటి శ్రీనివాస్, పవన్ కుమార్, కనకట్ల రవీందర్,షేక్ వల్లి, మునిందర్, అశోక్ రెడ్డి, కట్ట రాజు, రాయిల్ల మల్లేశం, శరత్ గౌడ్, పేంట రఘు, ప్రవీణ్ చేర్యాల, నరేందర్ గౌడ్, సాన లక్ష్మణ్, మామిడిపల్లి వెంకటేశం, చింతల లక్ష్మణ్, పేనుకుల అశోక్, చిరుత నరేష్, గోవర్ధన్ యాదవ్, మనెళ్లి ప్రసాద్, కాసారపు భుమేష్, యువరాజు, జలపతి, అజయ్, హరిశ్, సాయి మరియు సభ్యులు.
బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయినటువంటి T-NRI పాలసీని వెంటనే అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి కోరుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







