చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. నిర్భయ దోషుల కుటుంబీకులు
- March 16, 2020

ఢిల్లీ: నిర్భయ దోషుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని వారు ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. నిర్భయ నిందితుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు అందరూ కలిసి ఈ రాష్ట్రపతికి ఈ లేఖ రాశారు. కారుణ్య మరణం ప్రసాదించేందుకు రాష్ట్రపతిని, నిర్భయ తల్లిదండ్రులను కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు 13 మంది లేఖలో సంతకం చేశారు. ఇక 13 మందిలో ఇద్దరు ముఖేష్ కుటుంబానికి చెందిన వారు కాగా, నలుగురు పవన్, వినయ్ కుటుంబానికి చెందిన వారు, అక్షయ్ కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు.
నిర్భయ దోషులకు నాలుగో సారి డెత్ వారెంట్ జారీ అయింది. ఈనెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ పటియాల హైస్ కోర్టు తీర్పునిచ్చింది. నలుగురు దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు.. దోషుల వివిధ రకాల పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నాలుగో సారి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. మరి ఇప్పుడైనా ఉరి అమలు అవుతుందా..? లేదా? అనేది వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







