కరోనాపై పోరాటంలో ఖతార్...48 గంటల్లో అల్ మీరా మార్కెట్ ఏర్పాటు
- March 17, 2020దోహా:కరోనాపై పోరాటంలో భాగంగా గత కొద్ది రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఖతార్..ప్రజలకు నిత్యావసర సరుకులు అందించటంలోనూ అంతే వేగంగా అలర్ట్నేట్
యాక్షన్స్ తీసుకుంటుంది. వైరస్ భయంతో షాపులు కూడా మూత పడుతుండటంతో ముకైనిస్ ప్రాంతంలో అల్ మీరా కొత్త తాత్కాలిక శాఖను ప్రారంభించింది. అల్ మీరా
కన్సూమర్ గూడ్స్ కేవలం 48 గంటల్లోనే స్టోర్ ను ప్రారంభించటం విశేషం. ఈ స్టోర్ ద్వారా స్థానికులకు పరిశుభ్ర పరిచిన సరుకులు, శుభ్రమైన కూరగాయాలను స్థానికులకు
అందించనున్నారు. అంతేకాదు..ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సరుకుల కొరత ఏర్పడకుండా వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో అల్ మీరా కలిసి పనిచేస్తోంది. ఈ
సందర్భంగా అల్ మీరా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ యూసఫ్ అలీ అల్ ఒబైదాన్ మాట్లాడుతూ తమ స్టోర్ ద్వారా సరుకుల సరఫరా ఒక్కటే ముఖ్య ఉద్దేశం కాదని, వైరస్ సోకే అవకాశాలు లేకుండా పరిశుభ్రమైన సరుకులను అందించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..