దుబాయ్:దుబాయ్ పోలీస్ చీఫ్ కు లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి
- March 18, 2020
దుబాయ్:దుబాయ్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రిని లెఫ్టినెంట్ జనరల్ గా ప్రమోట్ చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ లో శాంతి భద్రతలను కాపాడటంలో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించినందుకు గుర్తింపుగా ఆయనకు పదోన్నతి కల్పించినట్లు తెలిపారు. అలాగే ప్రపంచ సురక్షిత నగరాల్లో ఒకటిగా దుబాయ్ గుర్తింపు పొందటంలో అబ్దుల్లా ఖలీఫా కృషి చేశారని ప్రశంసించారు. తనపై నమ్మకం ఉంచి తనకు పదోన్నతి కల్పించినందుకు దుబాయ్ రూలర్ సేక్ మొహమ్మద్ కి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మారీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో, ప్రజలకు రక్షణ కల్పిస్తూ వారి సుఖసంతోషాల్లో భాగస్వామ్యులు అవుతున్న పోలీసుల చేస్తున్న కృషి గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!









