మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహం
- March 18, 2020
మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహంకరోనా కట్టడిలో కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ ను వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సమావేశాలు, విద్యార్ధులకు క్లాసులు చెప్పేందుకు తాత్కాలికంగా వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ అనుమతి తెలిపింది. స్కైప్ ద్వారా బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలని, అలాగే గూగుల్ మీట్, జూమ్ యాప్స్ ద్వారా కంపెనీ సమావేశాలు, విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు.
కరోనా అంటువ్యాధి కావటంతో ప్రజలను వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నాల్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. అంతేకాదు ఈ గడ్డు పరిస్థితుల్లో టెలి కమ్యూనికేషన్ ద్వారా కొంత వరకు జనాలను బయటికి రాకుండా నియంత్రించే ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా టెలి కమ్యూనికేషన్స్ వినియోగాన్ని పెంచేందుకు సిటిజన్స్, రెసిడెంట్స్ కి ప్రొత్సాహకాలను కూడా ప్రకటించాలని నిన్న జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







