మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహం
- March 18, 2020
మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహంకరోనా కట్టడిలో కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ ను వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సమావేశాలు, విద్యార్ధులకు క్లాసులు చెప్పేందుకు తాత్కాలికంగా వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ అనుమతి తెలిపింది. స్కైప్ ద్వారా బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలని, అలాగే గూగుల్ మీట్, జూమ్ యాప్స్ ద్వారా కంపెనీ సమావేశాలు, విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు.
కరోనా అంటువ్యాధి కావటంతో ప్రజలను వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నాల్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. అంతేకాదు ఈ గడ్డు పరిస్థితుల్లో టెలి కమ్యూనికేషన్ ద్వారా కొంత వరకు జనాలను బయటికి రాకుండా నియంత్రించే ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా టెలి కమ్యూనికేషన్స్ వినియోగాన్ని పెంచేందుకు సిటిజన్స్, రెసిడెంట్స్ కి ప్రొత్సాహకాలను కూడా ప్రకటించాలని నిన్న జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం









