మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహం
- March 18, 2020
మస్కట్:కరోనా ప్రభావంతో వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ వినియోగానికి ప్రొత్సాహంకరోనా కట్టడిలో కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ ను వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల సమావేశాలు, విద్యార్ధులకు క్లాసులు చెప్పేందుకు తాత్కాలికంగా వీడియో కాన్ఫరెన్స్ యాప్స్ అనుమతి తెలిపింది. స్కైప్ ద్వారా బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలని, అలాగే గూగుల్ మీట్, జూమ్ యాప్స్ ద్వారా కంపెనీ సమావేశాలు, విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించుకోవాలని అధికారులు తెలిపారు.
కరోనా అంటువ్యాధి కావటంతో ప్రజలను వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నాల్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. అంతేకాదు ఈ గడ్డు పరిస్థితుల్లో టెలి కమ్యూనికేషన్ ద్వారా కొంత వరకు జనాలను బయటికి రాకుండా నియంత్రించే ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా టెలి కమ్యూనికేషన్స్ వినియోగాన్ని పెంచేందుకు సిటిజన్స్, రెసిడెంట్స్ కి ప్రొత్సాహకాలను కూడా ప్రకటించాలని నిన్న జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







