కరోనా వైరస్ కంటే పుకార్లే ప్రమాదకరం
- March 18, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనా వైరస్ పట్ల జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించింది. పుకార్లు, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని పేర్కొంది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ, అనవసర భయాలకు ప్రజలు లోను కావాల్సిన అవసరం లేదనీ, ఎప్పటికప్పుడు కరోనా వైరస్కి సంబంధించిన అధికారిక సమాచారం విడుదల చేస్తున్నామని మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ డాక్టర్ మొహమ్మద్ అబ్దెల్ అలి చెప్పారు. మినిస్ట్రీని సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రజలకు సూచించారాయన. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దనీ, అధికారికంగా కరోనా వైరస్పై ఆడియో, వీడియో ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పారాయన. ఎక్కువ మంది ప్రజలు గుమి గూడటం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందనీ, వ్యాధి అనుమానితులు ఇంటి వద్దనే వుండడం ద్వారా వ్యాప్తిని నిరోదించవచ్చుననీ చెప్పారు. మొత్తం 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరి పరిస్థితి మాత్రమే ఆందోళనకరంగా వుందని వివరించారు. సుమారు 700,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







