స్తంభించనున్న ప్రజా రవాణా

- March 19, 2020 , by Maagulf
స్తంభించనున్న ప్రజా రవాణా

మస్కట్‌: రవాణా మంత్రిత్వ శాఖ, ప్రజా రవాణా వ్యవస్థని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. బస్సులు, ఫెర్రీలు, ట్యాక్సీలు, వ్యాన్లు మరియు మినీ బస్‌లు ఇందులోకి వస్తాయి. ముసాందమ్ గవర్నరేట్‌ మరియు మసిరా విలాయత్‌ వైపు వెళ్ళే బస్సులు మరియు ఫెర్రీస్‌కి మినహాయింపు ఇచ్చారు. మార్చి 19 నుంచి తదుపరి నోటీసు వరకు ఈ బంద్‌ కొనసాగుతుంది. కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com