మోసపూరిత కాల్స్‌పై ప్రజల్ని అప్రమత్తం చేసిన ఇండియన్‌ ఎంబసీ

- March 19, 2020 , by Maagulf
మోసపూరిత కాల్స్‌పై ప్రజల్ని అప్రమత్తం చేసిన ఇండియన్‌ ఎంబసీ

కువైట్‌లో ఇండియన్‌ ఎంబసీ, తమ కమ్యూనిటీ మెంబర్స్‌ని మోసపూరిత కాల్స్‌పై అప్రమత్తం చేసింది. ఎంబసీ అధికారుల పేరుతో చేసే మోసపూరిత కాల్స్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఎంబసీ సూచించింది.మోసగాళ్ళ మాటలను నమ్మి, డబ్బుని వారికి అందించడం శ్రేయస్కరం కాదనీ, ఎంబసీ తరఫున ఎవరూ అలాంటి కాల్స్‌ చేయరని ఇండియన్‌ ఎంబసీ స్పష్టం చేసింది. ఎంబసీ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలూ వుంటాయనీ, బ్యాంక్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌, క్రెడిట్‌ కార్డు సమాచారం కోసం ఎవరు ఎంబసీ పేరుతో ఫోన్‌ చేసినా, వెంటనే ఎంబసీకి సమాచారమివ్వాలని ఇండియన్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com