మలేషియా లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించండి:ఎంవీవీ
- March 20, 2020తెలంగాణ రాష్ట్రాల తో పాటు పంజాబ్,కర్ణాటక ,తమిళనాడు తక్కిన రాష్ట్రాలకు చెందిన సుమారు 41 మందిని తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ లో ఆయన కార్యాలయానికి లేఖ రాశారు.ఈ సంధర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ మలేషియా లో చిక్కుకున్న ఆ 41 మందిని స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖ లో కోరామన్నారు. ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రాన్ని జై శంకర్ కు పంపామన్నారు. కరోన వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో ఆయా రాష్ట్రాల కు చెందిన 41 మంది అక్కడ చిక్కుకున్నారని. ఈ నేపధ్యంలో వారి తల్లి తండ్రులు ,కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. భాదితుల తల్లితండ్రులు తనను కలిసి , ఈ విషయం పై ఆవేదన వెలిబుచ్చి, తగు న్యాయంచేయాలని కోరారన్నారు. ఈ క్రమంలో మలేషియా నగర ఎయిర్పోర్టు లో సహాయార్ద్ధులై వేచి ఉన్న వారిని , తిరిగి రప్పించేందుకు చొరవచూపాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రికి లిఖిత పూర్వకంగా విన్నవించామన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?