ఉమ్ అల్ కువైన్లో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు
- March 20, 2020
ఉమ్ అల్ కువైన్: ఉమ్ అల్ కువైన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం తగ్గింపు అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20 నుంచి మే 30 వరకు ఈ తగ్గింపు అమల్లో వుంటుంది. ట్రాఫిక్ జరీమానాలు, ట్రాఫిక్ పాయింట్స్, ఇంపౌండ్ వెహికిల్స్కి ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఉమ్ అల్ కువైన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ బిన్ అరన్ మాట్లాడుతూ, వాహనదారులపై జరీమానాల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభ్యర్థించారు. మార్చి 19కి ముందు జారీ అయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ ద్వారా ఈ జరీమానాల చెల్లింపు చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు