ఒమన్:పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
- March 22, 2020
ఒమన్:పుకార్లు సృష్టించినా, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం హెచ్చరించింది. ప్రజా జీవనానికి భంగం కలిగించే ఏ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. సాంకేతిక సమాచార నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించకూడదని అధికారులు సూచించారు. మతపరమైన విలువలను కించపరిచేలా, ప్రజా జీవనానికి భంగం కలిగించేలా అపోహలు, అసత్య ప్రచారాలు సృష్టించినా, ప్రచారం చేసినా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ కేంద్రం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నెలకు తగ్గకుండా మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. అలాగే OMR1,000 కి తగ్గకుండా OMR3000కి ఎక్కువ కాకుండా జరిమానా విధిస్తామని కూడా అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు