ఇటలీలో ఒక్కరోజే 793 కరోనా మరణాలు
- March 22, 2020
ఇటలీలో కరోనా మహమ్మారి మారణహోమమే సృష్టిస్తోంది. వందల మంది ప్రాణాలను బలిగొంటూ ఉగ్రరూపంతో విరుచుకుపడుతోంది. యావత్తు దేశం నిర్బంధంలో ఉన్నా కొత్తవారి శరీరంలోకి తన కోరల్ని చొప్పిస్తూనే ఉంది. తొలినాళ్లలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎంతటి ఉపద్రవం తెచ్చిపెడుతోందో మిగిలిన దేశాలకు రుచి చూపిస్తోంది. శనివారం ఒక్కరోజే ఆ దేశంలో 793 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఒక దేశంలో ఒక్కరోజు ఇంతమంది మృత్యువాత పడడం ఇదే అత్యధికం. ఇటలీలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,825కు చేరింది. మరో 6,557 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ప్రముఖ నగరం మిలన్ సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే 3000 మంది మరణించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత 10 రోజుల నుంచి ఇటలీ పూర్తిగా నిర్బంధంలోనే ఉంది. అయినా గత రెండు రోజుల్లో 1,420 మంది మృతిచెందడం గమనార్హం. దీన్ని బట్టి ప్రజలు పాటిస్తున్న సామాజిక దూరం వంటి కట్టుబాట్లను దాటుకొని వైరస్ విజృంభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ వైరస్ను అడ్డుకోవడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీన్ని బట్టి వైరస్ ఏ స్థాయిలోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అకారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారిపై అక్కడి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసర పని మీద బయటకు వచ్చామని పౌరులే నిరూపించుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఉదయపు నడకకు సైతం ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







