క్యాన్సిలేషన్‌ ఫీజుని మినహాయించాలని హోటల్స్‌ని ఆదేశించిన సౌదీ

- March 24, 2020 , by Maagulf
క్యాన్సిలేషన్‌ ఫీజుని మినహాయించాలని హోటల్స్‌ని ఆదేశించిన సౌదీ

సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం, కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో క్యాన్సిలేషన్‌ ఫీజు మినహాయింపు ఇవ్వాలని హోటల్స్‌ని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కింగ్‌డమ్, ఉమ్రా ఫిలిగ్రిమేజ్‌ని రద్దు చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అనుమతి రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా హోటల్స్‌లో రూమ్స్ బుక్‌ చేసుకున్నవారికి రద్దు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23 నుంచి దేశంలో 21 రోజులపాటు కర్‌ఫ్యూని కింగ్‌ సల్మాన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకూ కింగ్‌డమ్ లో 562 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో 19 మంది పూర్తిగా వైరస్‌ నుంచి కోలుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com