యూఏఈ:సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు అనుమతి
- March 25, 2020యూఏఈ:ప్రజల అవసరాల నిమిత్తం నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, సహాకార సంఘాలు 24 రోజంతా తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే మెడికల్ షాపులు 24 గంటలూ ఓపెన్ చేసి ఉండొచ్చని కూడా యూఏఈ ఆరోగ్య పరిరక్షణ, జాతీయ విపత్తుల నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ కేంద్రమైన చైనా విపత్తు నుంచి తేరుకుంటోంది. ఇప్పటికే వుహాన్ లో బస్సు సర్వీసులను ప్రారంభించారు. బీజింగ్ జూ, చైనా వాల్ సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నారు. అయితే..చైనా కోలుకుంటుంటే యూరప్ దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ