దుబాయ్ : ఎక్స్ పో 2020 నిర్వహణపై సందిగ్థత...వచ్చే సోమవారం స్టీరింగ్ కమిటీ భేటీ
- March 25, 2020అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దుబాయ్ ఎక్స్ పో 2020 నిర్వహణపై సందిగ్థత కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై స్టీరింగ్ కమిటీ ఏ నిర్ణయానికి రాలేకపోతోంది. ప్రతిష్టాత్మకంగా భావించిన ఎక్స్ పో2020కి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసింది. అయితే..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని స్టీరింగ్ కమిటీ తెలిపింది. ఎక్స్ పో 2020పై నిర్ణయం తీసుకునేందుకు వచ్చే సోమవారం (మార్చి 30) భేటీ కావాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాల పరస్పర సహకారం, ఆవిష్కరణలను ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రదర్శించేందుకు కృతనిశ్చయంతో కృషిచేశామని స్టీరింగ్ కమిటీ వెల్లడించింది. ప్రస్తుత విపత్కర సమయంలో ఎక్స్ పోపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భాగస్వామ్య దేశాల మద్దతు అవసరమని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..